ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్పై సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “పరిగెత్తు పరిగెత్తు” యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత, యామినీ కృష్ణ అక్కరాజు మాట్లాడుతూ… ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ మూవీస్ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. “పరిగెత్తు పరిగెత్తు” చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్…