‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్. ఈమె టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేశ్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో హై బడ్జెట్తో రూపొందిన ‘మిస్ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ విడుదలవుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ను చూస్తే… సాధారణంగా పిల్లలు డాక్టరో, పోలీసో, లాయరో కావాలని కలలు కంటారు. కానీ.. ఆ కలలను నెరవేర్చుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయి…