హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం…