‘శశివదనే’ క్లైమాక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రెస్ మీట్లో హీరోయిన్ కోమలి ప్రసాద్ ‘శశివదనే’ ఏ ఒక్కరిని కూడా నిరాశ పర్చదు.. ప్రెస్ మీట్లో నిర్మాత అహితేజ బెల్లంకొండ రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో.. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం…
