15న రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహావిష్కరణ

Unveiling of Balu's statue at Rabindra Bharathi campus on the 15th

– ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు – సాయంత్రం సినీ సంగీత దర్శకులు, గాయకులచే బాలు సంగీత స్వర నీరాజనం ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గాంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర…