టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ (కొడగు)…
