నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి, ‘భూతద్ధం భాస్కర్’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘నవాబ్ కేఫ్’. తేజు అశ్విని హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో విశ్లేషణలో చూద్దాం… కథ: పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల) తన కుటుంబ వారసత్వంగా వస్తున్న ‘నవాబ్ కేఫ్’ అనే చాయ్ హోటల్ను నడుపుతుంటాడు. ఆయన కుమారుడు రాజా (శివ కందుకూరి) బాధ్యత లేకుండా స్నేహితులతో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. తన పెదనాన్న కొడుకు లగ్జరీ లైఫ్ చూసి ఆకర్షితుడైన రాజా, తమకున్న కోట్ల విలువైన కేఫ్ స్థలాన్ని అమ్మేసి జూబ్లీహిల్స్లో సెటిల్ అవుదామని తండ్రికి చెబుతాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ…
