అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా ‘నాతిచరామి’. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. త్వరలో ఓటీటీలో సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నాగు గవర మాట్లాడుతూ “హైదరాబాద్లో 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, కల్పిత పాత్రలతో రూపొందించిన చిత్రమిది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు సినిమాలో చాలా బావుంటాయి. అప్పట్లో చాలా మంది అమెరికా వెళ్లేవారు. వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా రూపొందించాం. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్…