విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ’ఖుషి ’. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్తోపాటు ’నా రోజా నువ్వే’ ’ఆరాధ్య’ ’ఖుషి’ అంటూ సాగే పాటలకు సోషల్విూడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని విజయ్, సమంత ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్…