సినీ నిర్మాత, రచయిత వి. మహేశ్ కన్నుమూత

Film producer and writer V. Mahesh passed away

ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో వి. మహేశ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడే మహేశ్‌. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మనుష్యులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను అందించింది వి. మహేశ్‌. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహాం (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) చిత్రాలను నిర్మించారు. అలానే కిరణ్‌ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్…