ఇటీవల యానిమేషన్ చిత్రంగా రూపొంది భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన ‘నరసింహా అవతార్’ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యానిమేషన్ ఫీచర్ ఫిలిం రిలీజ్ కాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ భారీ యానిమేటెడ్ ఫిలిం ‘మిషన్ సాంటా’. ఈ అత్యుత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం ఈ నెల 25న కిస్మస్ కానుకగా భారత్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 25న అంటే అదే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లోని పలు థియేటర్లో ‘మిషన్ సాంటా’ రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథతో రూపొందిన హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం ఇది. యానిమేషన్ క్వాలిటీ, సినిమాలో ఉండే…
