‘S-99 ‘రెండవ టీజర్ ను విడుదల చేసిన మురళీ మోహన్

'S-99 'రెండవ టీజర్ ను విడుదల చేసిన మురళీ మోహన్
Spread the love

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ’ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగన్మోహన్ మాట్లాడుతూ, ‘S-99 ‘ రెండవ టీజర్ను మురళీమోహన్ గారు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు టీజర్ లను సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ నెలలో రిలీజ్ చేసి, సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా వర్మ, ప్రొడ్యూసర్ యతీష్ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment