టాలీవుడ్ నటి రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్తో బిగ్ స్క్రీన్పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ విూడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి తాజాగా ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్పై నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది. నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా? లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా?.. ట్యాక్సులు కట్టలేదా?.. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? విూ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా వరకు దేవుడి అందరి వాడు. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే అంటూ రష్మి గౌతమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
Related posts
-
Happy Birthday to you… Global Star Prabhas!
Spread the love Today (October 23) is the birthday of global star Prabhas, on the occasion of... -
హ్యాపీ బర్త్ డే టూ యూ… గ్లోబల్ స్టార్ ప్రభాస్ !
Spread the love నేడు (అక్టోబర్ 23) గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు... -
‘రంగంస్థలం’ తరవాత అంతటి సినిమా : ‘పొట్టేల్’ పై దర్శకుడు సందీప్ వంగా
Spread the love ‘రంగంస్థలం’ చిత్రం తరవాత అంత మంచి కథతో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’ అని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి...