బాలు విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

CM Revanth Reddy invited to unveil Balu's statue
CM Revanth Reddy invited to unveil Balu's statue
Spread the love

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.