”నేనేమో మోతెవరి..నువ్వేమో తోతాపరి… నా గుండెల సరాసరి..కుర్సియేసి కూసొబెడతనే… నీ అయ్యా పట్వారి..నీ చిచ్చా దార్కారి..” ఏదైతే ఏందే మరి…నిన్నుఎత్తుకొనిబోతనే…అంటూ ఆహ్లాదరకరంగా సాగే ఈ పాట `పంచతంత్ర కథలు` చిత్రంలోనిది. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐదు వేరు వేరు కథల ఆంథాలజి కావడంతో ఈ మూవీకి `పంచతంత్ర కథలు` అనే యాప్ట్ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్తో…
Category: FILM NEWS
సాయిధన్సిక ప్రధాన పాత్రలో అందరినీ అలరించడానికి జూలై 1న రాబోతున్న `షికారు`
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఇటీవలే చిత్ర యూనిట్ వైజాగ్ నుంచి నెల్లూరువరకు రోడ్ట్రిప్ నిర్వహించింది. ప్రతిచోట యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆ విశేషాలను, చిత్ర విడుదల తేదీని తెలియజేస్తూ, చిత్ర యూనిట్ ఆదివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సాయిధన్నిక మాట్లాడుతూ, అందరి సమిష్టి కృషితో మన సినిమాగా పనిచేశాం. షికారు చిత్రానికి మొదట శ్రీకారం చుట్టింది…
సందడిగా ‘చోర్ బజార్’ సక్సెస్ మీట్
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా చోర్ బజార్. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా … హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్…
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో “మనసానమః”
విరాజ్ అశ్విన్ నటించిన షార్ట్ ఫిలిం మనసానమః తన రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సహా ఆస్కార్ క్వాలిఫైకు వెళ్లిన ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ షార్ట్ ఫిలింగా ఎంపికై ఆశ్చర్యపరిచింది. తాజాగా “మనసానమః” జాతీయ, అంతర్జాతీయంగా అత్యధిక పురస్కారాలు గెల్చుకున్న చిత్రంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ రికార్డ్స్ లో ఎక్కిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. మనసానమఃలో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమహా షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్…
ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏనుగు’కు క్లీన్ U/A
శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఏనుగు”. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు…
చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలి…మౌత్ పబ్లిసిటీతో ‘7 డేస్ 6 నైట్స్’ కలెక్షన్స్ ప్రతి షోకి పెరుగుతున్నాయి సక్సెస్ మీట్లో మెగా మేకర్ ఎంఎస్ రాజు
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ ఈ శుక్రవారం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా… మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోన్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్లో మెగా మేకర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”థియేటర్కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు హీరోయిన్లను ఎవరో అమ్మాయిలు అనుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళను అందరూ చుట్టుముట్టారు. రోజు రోజుకి పెరిగే చిత్రమిది. హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ. ప్రసాద్ మల్టీప్లెక్స్లో 350 మంది జనంతో చూశాం. మార్వలెస్ ఎక్స్పీరియన్స్. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్… ఈ…
జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా, ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ‘జిన్నా’ లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పార్టీ సాంగ్ కి గణేష్ ఆచార్య స్టెప్స్ సమకూర్చారు. ఎంగేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ…
అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటున్న నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ ట్రైలర్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం…
అనసూయ ప్రధాన పాత్రలో `అరి` చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
తన మొదటి మూవీ`పేపర్ బాయ్`తో హార్ట్ టచింగ్ చిత్రంగా హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో , ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుదలయింది. శుక్రవారంనాడు గచ్చిబౌలిలో రేడిసన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ఎం.ఎల్.ఎ. సైదిరెడ్డి మాట్లాడుతూ, అందరికీ పేరుపేరునా నమస్కారాలు. రవీందర్రెడ్డి చేసిన మూవీకి నేనూ వచ్చాను. ఈ సినిమాను టాలెంటెడ్ నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరూ కలిసి చేశారు. నిర్మాతలు బిజినెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వారు సినిమా చేస్తే ఎలా వుంటుందనే ప్రయోగం చేశారు.…
హీరో సాయిరాం శంకర్ సినిమా ‘వెయ్ దరువెయ్’ ప్రారంభం
శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో.. హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదములు.”యస్. ఆర్ కల్యాణ మండపం” తర్వాత…
