కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నారు కమల్ హాసన్. సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ..ఈ మూడు పాత్రలను ఏ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం ఆశ్చర్యపరిచింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్…
Category: FILM NEWS
రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ వంటి సినిమాలో నంబి నారాయణన్ వంటి రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ను చూపించబోతున్నాం : హీరో ఆర్. మాధవన్
ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్.మాధవన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . హీరోగా నటిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27 ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. హీరో, దర్శకుడు ఆర్.మాధవన్ మాట్లాడుతూ ‘‘నంబి నారాయణన్గారిని నేను నంబి సార్ అని పిలుస్తుంటాను. నేను విక్రమ్ వేద సినిమా చేసిన తర్వాత ఇస్రో సైంటిస్ట్కి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మాల్దీవులకు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పాకిస్థాన్కు మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్ను అమ్మేశాడు. ఆ…
ప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.…
‘బనారస్’ చిత్రం నుంచి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదలైన ‘మాయ గంగ’ సాంగ్ రిలీజ్
జైద్ ఖాన్, సోనాల్ మోన్టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. జయతీర్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిలక్రాజ్ బల్లాల్ నిర్మాత. అజనీష్ లోక్నాథ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా నుంచి ‘మాయ గంగ’ పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత తిలక్గారి మనసు చాలా మంచి మనసు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్ కోసం మీరు ఓ సినిమా చేయడం గొప్ప విషయం. మంచి ప్రయత్నం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. బ్యూటీఫుల్గా పాటను రాశాడు. జయతీర్థ…
కార్తీ, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్’ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుంది. ఇటీవలి కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాలని సెలక్టీవ్ గా పంపిణీ చేస్తూ, క్యాలిటీ చిత్రాలను అందించే నిర్మాణ సంస్థలతో జతకడుతోంది. కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు ‘సర్దార్’ ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్దార్లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా…
Annapurna Studios Releasing Karthi, PS Mithran, Prince Pictures Sardar Grandly In Telugu States
Hero Karthi has teamed up with director PS Mithran of Abhimanyudu fame for an action thriller movie Sardar being produced by S Lakshman Kumar under the banner of Prince Pictures. King Nagarjuna Akkineni’s Annapurna Studios has obtained the distribution rights of the movie for Telugu states. Annapurna Studios is in recent times selectively distributing films and collaborating with production houses that deliver high quality films. Karthi enjoys huge following in Telugu, wherein director PS Mithran won appreciations for Abhimanyudu. Known for making technological films, the director is making Sardar with…
అల్లరి నరేష్ -విజయ్ కలయికలో రెండో చిత్రం
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేఛ్చగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఇంటరెస్టింగ్ గా వుంది. హై ఇంటెన్సిటీ తో కూడుకున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని…
వైష్ణవ్, కేతికా శర్మల ‘రంగ రంగ వైభవంగా’ టీజర్ విడుదల
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో… నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో రంగ రంగ వైభవంగా సినిమా చేశాను. సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అన్ని సినిమాలు హిట్ అయినట్లే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.…
చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి: నట్టి కుమార్
సిరి ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ నం.2 సినిమాను హైదరాబాద్ మధురానగర్లోని తమ కార్యాలయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత నట్టి కుమార్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. సిరి ఎంటర్టైన్మెంట్స్ తన తొలి చిత్రం “కుట్ర” ఆగస్టులో రిలీజ్కు సన్నద్ధం అవుతుండగా వారు రెండవ సినిమాను ప్రారంభించారు. ఆకలి మనుషులను ఏ స్థాయికి తీసుకువెళుతుందనే కథాంశంతో ఆద్యంతం సస్పెన్స్గా, ధ్రిల్లింగ్లో ఉన్న ఉందే ఈ సినిమాను ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో మరియు హైదరాబాద్లో జూలై మొదటి వారంలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, ఈ సినిమాను దర్శకులు సిరిపురం రాజేష్ ప్రజెంట్ చేస్తున్నారని సినీ నిర్మాత సిరిపురం లావణ్య పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో అనేక మంది సినిమా నిర్మాణం పట్ల ఆసక్తి చూపుతున్నారని, పెద్ద పెద్ద సినిమాలనే కాకుండా చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు చూసి…
‘స్వాతిముత్యం‘ నుంచి ప్రేమ గీతం వచ్చేసింది : ఆగస్ట్ 13న విడుదల
ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయి కి , ఓ అబ్బాయి కి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం‘ లోని గీతం కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది. ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం. ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం ఈరోజు విడుదల అయింది. నాయిక వర్ష బొల్లమ్మతో “నీ చారెడు కళ్లే…
