హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్కు చెందిన ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఎయిర్ టికెటింగ్, గ్రూప్ ప్యాకేజీలు, వీసాలు, ఫారెక్స్, ప్రయాణ బీమా తదితర అన్ని సేవలను ఒకే గొడుగు కింద ఈ సంస్థ అందిస్తుంది. మాక్సివిజన్, క్లౌడ్టారో, గ్నాపికా ఎంటర్టైన్మెంట్, ఎస్. జి మూవీ మేకర్స్ తదితర ప్రతిష్టాత్మక కార్పొరేట్ సంస్థలన్నింటికి ఈ సంస్థనే సేవలందిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), (NATA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు మరెన్నో సహా అనేక లాభాపేక్ష లేని సంస్థలలో భాగంగా వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో…
Category: Lifestyle
ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనాన్ని నిర్మిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ
హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం…
సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం లో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….
హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేయనున్నారు అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తెలిపారు.…
ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన వేడుక ‘హోలీ’ : శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు
హైదరాబాద్, మార్చి 25 : భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. . హ్యాపీ హోలీ అంటూ యువత సోమవారం తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కలర్ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ హోలీ వేడుకలు సోమవారం శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెరుకు ఉమేష్ గౌడ్, పి.ఎస్.రాము, సర్దా శివకృష్ణ, ఏలే సుధాకర్, రేవంత్ గౌడ్, కృష్ణారెడ్డి, భాస్కర్, రాము గౌడ్, వీరాచారి తదితరులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొని కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ…
టీపీటీ నిధులను సీఎం విడుదల చేయడం హర్షనీయం
•కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ హిమాయత్నగర్, ప్రజాతంత్ర, మార్చి 03 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి గడిచిన 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను ఇటీవల రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షనీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు సీఎం ఎ.రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న రూ.48 కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీనికి కంటోన్మెంట్ బోర్డు తరపున ఆమె సీఎం ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ…
హీరో ఆట సందీప్ చేతుల మీదుగా ‘ఐశ్వర్య సిల్క్స్’ 3వ వార్షికోత్సవ వేడుక
హైదరాబాద్ వస్త్ర ప్రపంచంలో మరో రంగుల ప్రపంచం 3 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైంది. కూకట్ పల్లిలో “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవం సందర్భగా షోరూంను ప్రముఖ హీరో ఆట సందీప్ , ఆయన సతీమణి జ్యోతి రాజ్, యాంకర్ జాను నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య సిల్క్స్ ఎండీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా హీరో సందీప్ మాట్లాడుతూ “లక్ష్మి గారు ధర్మవరం కు చెందిన వీవర్స్ సామాజిక వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఈ రోజుఆమె అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు అభినందనీయం. ఆమె హైదరాబాద్ లో రెండు షో రూమ్ లు రన్ చేస్తున్నారు. ఆమె ఫ్యూచర్ లో మరిన్ని ఐశ్వర్య సిల్క్స్ బ్రాంచీలు స్థాపించాలని కోరుకుంటున్నాను.”అని అన్నారు. ఈ సందర్భగా ఐశ్వర్య సిల్క్స్ ఎమ్ డి .లక్ష్మి మాట్లాడుతూ ” నేటి…
డాక్టర్ సూర్యపవన్ రెడ్డికి పీసీఇండియన్ అచీవర్స్ అవార్డ్
దేశంలో విద్యా, వైద్యం, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగాల్లో విశేషంగా సేవ చేసిన వారిని ప్రోత్సహించేందుకు “పవర్ కారిడార్ నేషనల్ మేగజిన్” వారు అందించే ప్రతిష్టాత్మకమైన పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్స్ లో తెలంగాణ బిడ్డ, ప్రముఖ డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వైద్య రంగం విభాగంలో లో బెస్ట్ అచీవర్ అవార్డును అందుకున్నారు. ఇవ్వాల ఢిల్లీలోని హయత్ రిజెన్సీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. టైప్-1 చెక్కర వ్యాధి నిర్మూలనలో 23 సంవత్సరాలుగా విశేషంగా వైద్యసేవలు అందిస్తూ.. లక్షలాది చక్కెర వ్యాధిగ్రస్తులను కొత్త జీవితాన్ని అందించినందుకుగాను సూర్యపవన్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. డాక్టర్ కోమటిరెడ్డి సూర్యపవన్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మాత్యులు…
PC Indian Achievers Award confined to Dr. Suryapavan Reddy
To encourage those who have served the country in the fields of education, medicine and entrepreneurship the “Power Corridor National Magazine” is giving prestigious PC Indian Achievers Awards every year. Dr. Komatireddy Suryapavan Reddy, who hails from Telangana, has received the Best Achiever Award in the medical field this year. Suryapavan Reddy received the award from Union Minister of Road Transport and Highways Nitin Gadkari at a function held at Hyatt Regency, New Delhi. Suryapavan Reddy selected for awards for his outstanding contribution for providing special medical services for 23…
వైద్య విద్యారంగంలో చేస్తున్న సేవలకు గాను డాక్టర్ సి.హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు!
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మరియు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచివర్స్ అవార్డు లభించడం చాలా ఆనందకరం. వైద్య మరియు విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహకారాలు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈనెల 28న ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ నితిన్ గడ్కారీ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. ఈయనతో పాటు సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా సామాజిక సేవ…
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా.ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు:
ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత…
