మైటీ ఒక్ పిక్చర్స్ పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ’సి 202’. మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి మనోహరి కె ఎ నిర్మాత. పూర్తి గా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విశేషం ఏమిటంటే.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ.. కేవలం సౌండ్ ఎఫెక్ట్స్తో ఉండటం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు, హీరో అయిన మున్నా కాశి మాట్లాడుతూ.. ’సి 202’ ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కించాం. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అందరికీ అది అర్థమవుతుంది. ఒక డైలాగ్ కూడా లేకుండా క్యారెక్టర్లను చూపిస్తూ సౌండ్ ఎఫెక్ట్స్తో.. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాపై ఇంట్రస్ట్ కలిగించేలా ట్రైలర్ని కట్ చేశాం. ఈ ట్రైలర్ని ‘సౌండ్ ఆఫ్ సి 202’ అని పిలుచుకుంటున్నాము. ఈ ట్రైలర్ని మంచి సౌండ్ సిస్టమ్తో చూడండి, ఖచ్చితంగా సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది. సినిమా విషయానికి వస్తే.. ‘సి 202’ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ, స్క్రీన్ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాను అద్భుతమైన సస్పెన్స్, భయపడే హారర్ సన్నివేశాలతో.. మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్తో చిత్రీకరించాము. షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలను ఉపయోగించాము. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరంతా ఇప్పటి వరకు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో 21 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. అవన్నీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
విడుదలకు ‘సి202’ హారర్ చిత్రం రెడీ…!
