పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం సీనియర్ పాత్రికేయుడు భగీరథ ను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు .శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ప్రతి నెల హైదరాబాద్ రవీంద్రభారతి లో సినీ సంగీత విభావరి లు నిర్వహిస్తూ ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందని , ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు శ్రీమతి ఆమని గారు తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ లో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు .2001వ సంవత్సరంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు రవీంద్రభారతి ప్రారంభించారని ,అందుచేత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట వారి పుట్టిన…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘క్షీరసాగర మథనం’ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం!
“బిగ్ బాస్” ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన “క్షీర సాగర మథనం” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా… యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన “క్షీరసాగర మథనం” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై… కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న “అమెజాన్ ప్రైమ్”లో విడుదలై… సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్…
డిస్నీ+ హాట్ స్టార్ తొలిసారి తెలుగు వెబ్ సిరీస్ ‘అన్హర్డ్’ ప్రకటించిన ఎల్లన్నార్ ఫిలిమ్స్
ఎక్స్క్లూజివ్ డిస్ని+ హాట్ స్టార్ ఈ వెబ్ సీరీస్ సెప్టెంబర్ 17 నుంచి ప్రసారంకానుంది. రాధికా లావు నిర్మాణ సారథ్యంలో, ఆదిత్యా కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకొని 2021 సెప్టెంబర్ 17న విడుదల కానున్నఈ సిరీస్ భారత స్వాతంత్ర్య పోరాటంపై సగటు మనిషి దృక్పథాన్ని వెల్లడిస్తుంది. సగటు మనిషి విశ్వాస వ్యవస్థ ఒకదేశపు గతిని మార్చగలదా? అన్హర్డ్ తెలుగు హాట్ స్టార్ స్పెషల్ సిరీస్లోకి ప్రవేశించింది డిస్నీ+హాట్స్టార్. అన్హర్డ్ యొక్క ప్రత్యేక కథన రీతి భారత దేశ చరిత్రలో ముఖ్యమైన కాలానికి సంబంధించిన విభిన్న తాత్వికతలను వెల్లడిస్తుంది. ఈసిరీస్ ఐదు ముఖ్యపాత్రల జీవితాలను అనుసరిస్తుంది. భారత్ ఒక దేశంగా ఆవిర్భవించేందుకు చేస్తున్నపోరాటంలో అవన్నీతమను తాము అన్వేషించుకుంటాయి, తాము పోషించే పాత్రలను కూడా. బ్రిటిష్వారి నుంచి మాత్రమే కాదు, నిజాం నుంచి కూడా స్వాతంత్ర్యం కోరుకోవడం చుట్టూ మరియు హైదరాబాద్…
నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్రాజ్, జీవిత రాజశేఖర్ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు
‘మరో ప్రస్థానం’ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ : అందాల కథానాయిక ముస్కాన్ సేథి
“పైసా వసూల్”, “రాగల 24 గంటల్లో” చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి “మరో ప్రస్థానం” సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జానీ తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. “మరో ప్రస్థానం” చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న “మరో ప్రస్థానం” మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ*… మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో…
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విజయ రాఘవన్’ : ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని
తెలుగులో సెప్టెంబర్ 17న విడుదల: బిగ్ టిక్కెట్ ఆవిష్కరణ ‘నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘విజయ రాఘవన్’ పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ టిక్కెట్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా…రైటర్…
‘మాస్ట్రో’లో ఫస్ట్ షాట్ నుండి నితిన్ తన క్యారెక్టర్లో లీనమై చేశారు : డైరెక్టర్ మేర్లపాక గాంధీ
ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల ఈ సినిమా అవుట్పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యూచర్లో నితిన్తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. నభ నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ ‘అందాధున్’ సినిమా చూశా. ‘అందాధున్’…
‘తలైవి’ సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చింది : నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి
సినీనటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేశారు. ‘తలైవి’ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న సినిమా విడుదల కాగా.. విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి మీడియాతో ముచ్చటించారు. ‘తలైవి’ సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాను అనే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చాయి. మొత్తానికి ‘తలైవి’ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్తో బడ్జెట్ మొత్తం రికవరీ…
సాయిరామ్ శంకర్, ఎస్ఎస్ మురళీకృష్ట రీసౌండ్ ఫస్ట్ లుక్ విడుదల
కొంత విరామం తర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని పవర్ఫుల్ మరియు మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ రీసౌండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే సాయి రామ్ శంకర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతకు ముందు పోలీసులతో ఘర్షన జరిగినట్లు…
Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out
Hero Sai Raam Shankar who took some break is making comeback with a proper commercial film being directed by debutant SS Murali Krishna. Rashi Singh is playing the female lead, while Aravind Krishna will be seen in a vital role.Today, on the occasion of Sai Raam Shankar’s birthday, title and first look poster of the movie have been unveiled. The film gets a powerful and mass-appealing title- Resound. Star directors Gopichand Malineni and Bobby have launched the first look poster and wished the entire team all the luck.Coming to first…
