రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు “మాటే మంత్రము” అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ…మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి “మాటే…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘మేజర్’ టీమ్ కు హీరో విజయ్ దేవరకొండ అభినందనలు!!
ముంబై ఉగ్రదాడి అమరుడు, వందల మందిని కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన మేజర్ సినిమాను ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని హైదరాబాద్ లో చూసిన విజయ్.. సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయని అన్నారు. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమని, దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు గొప్పవారని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు.
నెట్టింట వైరల్గా మారిన సత్యదేవ్ పాట!!
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సత్యదేవ్. నటనకు ప్రాధాన్యమున్నవైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న అతడు అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్సె’ ఒకటి. ‘బ్లఫ్ మాస్టర్’ ఫేం గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. అవినీతిమైన రాజకీయనాయకులను, ఒంటి చేత్తో ఎదుర్కొన్న యువకుడి పాత్రలో సత్యదేవ్ నటించనున్నాడు. యాక్షన్ థిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను స్టార్ చేసింది. తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రకటించారు. ఈ చిత్రంలో ‘రారమ్మంది.. ఊరు’ అంటు సాగే పాటను జూన్ 7న విడుదల చేయబోతున్నట్లు…
Rashikhanna : శర్వానంద్కు జోడీగా.. !
టాలీవుడ్ లో గత కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ పీపుల్స్ మీడియా నిర్మాణంలో కృష్ణచైతన్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అదే.. రాశీఖన్నాతొలిసారి శర్వానంద్కు జోడీగా నటించబోతుందని టాలీవుడ్ సర్కిల్ తాజా సమాచారం. రాశీఖన్నా ప్రస్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్లో నటిస్తోంది. శర్వానంద్ అనుకున్న ప్రకారం మేకోవర్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందట. కృష్ణచైతన్య ఇప్పటికే నితిన్తో పవర్ పేట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని…
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న’విక్రమ్’
జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘విక్రమ్’ మూవీలో కమల్ యాక్షన్ సీన్స్తో అదరగొట్టాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ కలెక్షన్లతో బాక్సాఫీస్ను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన లెక్కలు చూస్తుంటే బాప్ రే.. అనిపిస్తోంది. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ తాజాగా రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. వీకెండ్ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రమ్ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో ఉంది. 167 మిలియన్ డాలర్లతో టాప్ గన్ మావెరిక్ మొదటి స్థానంలో, 55…
బాలీవుడ్ పై సమంత ఫోకస్!
తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా బాలీవుడ్లో సత్తా చాటింది. ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ‘యశోద’ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టుల పై ఎక్కువ ఫోకస్ పెట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే.. దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన ఈ భామ ఇప్పటివరకు మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. మలయాళంలో సీనియర్ దర్శకుడైన షాజీ కైలాస్ ‘పింక్ పోలీస్’ పేరుతో…
సమాజాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకం : హీరో సుమన్
ఘనంగా తిరుమల బ్యాంక్ 24వ వార్షికోత్సవ వేడుకలు కస్టమర్ల కు నమ్మకం కలిగిస్తూ తక్షణ సేవలు అందిస్తూ 24 ఏళ్ళ పాటు సహకార బ్యాంక్ కొనసాగడం అభినందనీయం అని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా కొనియాడారు. ఎన్నో జాతీయ బ్యాంకు ల మధ్య పోటీ పడుతూ తిరుమల కో ఆపరేటివ్ బ్యాంకు మంచి పేరు తో మనుగడ సాగించి గుర్తింపు పొందడం ప్రశంసనీయం అని ఆయన అభినందించారు. శనివారం కాచిగూడ టూరిస్ట్ హోటల్ లో తిరుమల సహకార బ్యాంక్ 24 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన కొలేటి దామోదర్ ఆ బ్యాంక్ అభివృద్ధి లో గణనీయమైన పాత్ర పోషించిన చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ తో పాటు కొందరు కస్టమర్ల ను సన్మానించారు. హీరో సుమన్ మాట్లాడుతూ అంకితభావం…
It’s a wrap for Ilaiyaraaja’s musical ‘Music School’ starring Sharman Joshi & Shriya Saran
With music by the legendary maestro Ilaiyaraaja, Music School has stirred quite an excitement as one of the most awaited bilingual ( Hindi –Telugu) musical. After a series of schedules in Hyderabad and Goa, the upcoming musical has wrapped up its shoot in Hyderabad pulling off a mammoth opening song of this 11 song musical, which includes 3 songs from the Sound of Music. The writer-director Papa Rao Biyyala thinks that the ace cinematographer Kiran Deohans has enhanced the visual appeal of the film by a few notches. The Cinematographer…
మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియాశరన్ నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ పూర్తి
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా సంగీత సారథ్యం వహించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీపై ప్రారంభం నుంచి అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరిపారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్తో చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో కేవలం మూడు పాటలు కేవలం మ్యూజిక్తోనే సాగుతాయి. సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్ను గ్రాండ్గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లారని రైటర్ – డైరెక్టర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రాణం పెట్టి తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్స్ మాట్లాడుతూ…
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ‘అనుకోని ప్రయాణం’
ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం. ఈ చిత్రం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నలఫై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి కొన్ని కథలు విన్నప్పుడు షాకైనమాటే వాస్తవామే. కానీ దర్శకుడు వెంకటేష్ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినపుడు ఫ్రీజ్ అయ్యాను. 45ఏళ్ళ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా చేస్తున్నాననే భావన కలిగింది. కరోనా సమయంలో వలస కూలీలు ప్రయాణం నుండి పుట్టిన…
