సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్కుమార్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మరువ తరమా’. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. సినిమా నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగాహాజరయ్యారు. ఈ ఈవెంట్లో.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను అని చైతన్య చెప్పినప్పుడు ఆలోచించుకోమని అన్నాను. కానీ చైతన్య తనమీద తనకున్న నమ్మకంతో ధైర్యంగా అడుగేశారు. నాకు సినిమాలు చాలా ఇష్టం. రోహిణి గారు అప్పటికీ…
Author: M.D ABDUL
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ : రామ్ పోతినేనికి కమ్బ్యాక్ హిట్ దక్కిందా?
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. మాస్ సినిమాలు ఎందుకో రామ్ కి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. ఆయన మార్కెట్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. గతంలో కూడా ఇంతే, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్న సమయంలో ‘నేను శైలజ’ వంటి కూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్ అదే ఫార్ములా ని అనుసరించాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు మహేష్ బాబు రామ్ తో ‘ ఆంధ్రా కింగ్ తాలూకా’ చేసాడు. హీరో రామ్ హిట్టు…
‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి?
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజాచిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో మరో వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం సేతుపతి సీన్లను గోవాలో తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. అయితే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి నిజంగానే నటిస్తున్నారా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గతంలో రజినీకాంత్-విజయ్ సేతుపతి కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ‘పెట్టా’ చిత్రంలో కలిసి నటించైనా విషయం తెలిసిందే. చూడాలి మరి.. ‘జైలర్ 2’కోసం వెర్సటైల్ యాక్టర్ మక్కల్…
సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ’16 రోజుల పండగ’ ప్రారంభం
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’16 రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డి సురేష్…
‘రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్ సెలబ్రేషన్స్
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ…
ఒక్క రోజులో జరిగే కథ ‘రివాల్వర్ రీటా’ : కీర్తి సురేష్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం – జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇందులో సునీల్ గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రాధిక గారు చాలా చక్కని…
Nandamuri Balakrishna, Gopichand Malineni, Venkata Satish Kilaru, Vriddhi Cinemas’ Historical Epic #NBK111 Launched Majestically
God of the Masses, Nandamuri Balakrishna, riding high on an unstoppable streak of blockbusters, is gearing up to shake the box office once again as he teams up with mass director Gopichand Malineni for their next explosive spectacle, #NBK111. After rewriting box-office history with Veera Simha Reddy, this powerhouse combo is returning with an even bigger and grander historical epic. Produced by Venkata Satish Kilaru under the prestigious Vriddhi Cinemas banner, currently making waves with the massive pan-India venture Peddi, this new project is set to be mounted on an…
నందమూరి బాలకృష్ణ, హీరోగా #NBK111 ప్రారంభం
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు నేడు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్బస్టర్లను అందించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి…
నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సంకల్ప్ దివాస్’
హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని…
లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం
బాలీవుడ్ లెజెండరీ నటుడు శ్రీ ధర్మేంద్ర గారి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ చిరంజీవి ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. “శ్రీ ధర్మేంద్ర గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మానవతావాది కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ ఆయన ప్రదర్శించే వినయం, ఆప్యాయత నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను, వ్యక్తిగత క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియ మిత్రులు సన్నీ…
