అమెజాన్‌ ప్రైమ్‌లో ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’

'Arjun Son of Vyjayanthi' on Amazon Prime
Spread the love

నటులు కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన చిత్రం ’అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 18న థియేటర్లలో విడుదలైంది. తల్లి కొడుకుల అనుబంధం, యాక్షన్‌ ప్రధానంగా సాగిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇటీవల రెంటల్‌ విధానంలో ప్రముఖ ఓటీటీ- వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చిన విషయం తెలిసిందే. రెంటల్‌ రావడంతో సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. అయితే తాజాగా ఈ సినిమాను రెంటల్‌ నుంచి తొలగించి ఫ్రీగా అందుబాటులోకి తీసుకోచ్చారు. ప్రైమ్‌ చందదారులు ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైజయంతి (విజయశాంతి) అనే నిజాయితీగల ఐపీఎస్‌ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు అర్జున్‌ (కళ్యాణ్‌ రామ్‌) అనే ఒకే ఒక్క కొడుకు ఉంటాడు. అర్జున్‌ను ఎలాగైనా ఐపీఎస్‌ అధికారిగా చూడాలనేది వైజయంతి కల. దాని కోసం ఆమె అతన్ని ఐపీఎస్‌ చదివించి శిక్షణ కోసం ఢల్లీికి పంపుతుంది. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి రావాల్సిన అర్జున్‌, వెళ్లిన ఐదో రోజే తిరిగి వస్తాడు. అందుకు కారణం అతని తండ్రి మరణం. నావికాదళ అధికారి అయిన అతని తండ్రి సముద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించాడని పోలీసులు చెబుతారు. అయితే నిజానికి అర్జున్‌ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు, అది ఒక హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్‌, తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ వైజయంతి అతన్ని వారించి, చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడేలా చూస్తానని చెబుతుంది. అంతేకాకుండా, అర్జున్‌ను ఐపీఎస్‌ పూర్తి చేయమని చెప్పి మళ్లీ శిక్షణకు పంపిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత అర్జున్‌ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు. అదే రోజు అతని తండ్రి కేసు యొక్క తీర్పు వెలువడుతుంది. అర్జున్‌ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశాత్తు జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుండి బయటకు వస్తూనే వైజయంతిని అవమానకరంగా మాట్లాడుతారు. అన్యాయం ముందు చట్టం మరియు న్యాయం ఓడిపోవడం అర్జున్‌ కళ్లారా చూస్తాడు. తన కళ్ల ముందే తల్లిని అవమానిస్తుంటే అతను తట్టు-కోలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే ఒక హంతకుడిని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలోని 41 మందిని నరికి చంపుతాడు. ఐపీఎస్‌ కావాల్సిన కొడుకు తన కళ్ల ముందే హంతకుడిగా మారడం చూసిన వైజయంతి దిగ్భార్రతికి గురవుతుంది. గూండాగా మారిన కొడుకుతోనే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి వేరు చేసిన ఈ తల్లి కొడుకులు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్‌ అవ్వాల్సిన అర్జున్‌ గూండాగా మారి ఏమి సాధించాడన్నది మిగతా కథ.

Related posts

Leave a Comment