అనసూయ.. నెటిజన్లకు మరోసారి టార్గెట్‌ !

Anasuya.. Target for netizens once again!
Spread the love

అనసూయ టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్‌ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్‌ అయింది. ప్రస్తుతం టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్‌ బ్రాండ్‌ అన్న విషయం తెలిసిందే! సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ట్రోలింగ్‌, మీమ్స్‌ అంటారా లెక్కలేనన్ని. అయితే వీటిపై పెద్ద దృష్టి పెట్టదు అనసూయ. సమయం వచ్చినప్పుడు మాత్రం దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి నెటిజన్లకు టార్గెట్‌ అయింది అనసూయ. ఓ టీవీ ఛానల్‌లో జరిగే అవార్డ్‌ ఫంక్షన్‌ లో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్‌ కోసం అనసూయ మహానటి సావిత్రి గెటప్‌ వేశారు. అంతే కాదు.. జమున, శ్రీదేవి, సౌందర్య లాగా కూడా కనిపించింది. గతంలో వారు నటించిన పాటలకు అనసూయ డాన్స్‌ చేసినట్టుగా ఆ ఫొటోలు చూస్తే తెలుస్తోంది. ఆ ఫొటోలనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘‘సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య పాత్రలకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టం. ఇదొక చిన్న ట్రిబ్యూట్‌లా ఉంటుంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఆ ఫొటోలు చూసి చాలామంది పాజిటివ్‌గా స్పందించారు. అచ్చం సావిత్రి గారిలా ఉన్నారు’’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఓ నెటిజన్ అయితే ‘ఎక్స్‌పోజ్‌ చేసినంత తేలిక కాదు సావిత్రిగారిలా నటించడమంటే’ అని కామెంట్‌ చేశాడు…

Related posts

Leave a Comment