గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

Virosh couple creates global record

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం. విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను ఈ అరుదైన రికార్డ్ చూపిస్తోంది. ఇటీవలే ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.…

‘పెద్ది’నుంచి జాన్వీ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌

Janhvi's birthday special poster from 'Peddhi'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పోస్టర్‌లో మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ లెహంగా ధరించి ఆమె స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మెడలో లేయర్డ్ నెక్లెస్‌లు, చేతికి బ్రేస్‌లెట్, ఎరుపు రంగు రౌండ్ సన్‌గ్లాసెస్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను…

వెంకన్న పాదాలు… భక్త జనాన్ని సంకటాల నుండి రక్షించే అభయ వేదాలు..

Venkanna's feet... the Abhaya Vedas that protect the devotees from troubles..

నమ్ముకున్న వారి ఇంట సిరి సౌభాగ్యాలు కురిపించే ఐశ్వర్య లక్ష్మీ చిరు నవ్వుల నాదాలు.. ఈ విషయం … తెలుగునాట తిరుమల తిరుపతి పద్మావతి అలివేలు మంగా సమే త శ్రీనివాస చరణారవింద శరణాగతులు అందరికీ అనుభవైక వేద్యమైన అనుభూతి!! స్వామి వారి శక్తికి… ఆర్త రక్షణా యుక్తికి ఎన్నో ఎన్నెన్నో నిదర్శనల ప్రదర్శనలు తెలిసినవి కొన్నే తెలియనివి ఎన్నో!! తెలుగునాట లక్షల కుటుంబాలకు ఇలవేల్పు సిరితాల్పు అయిన ఆ శేషాద్రి వాసుడు.. ఏడు కొండలవాడు..వెంకటరమణుడు….గోవిందుడు… అలానే ….తెనాలి కి చెందిన చదలవాడ వారి కుటుంబానికి కూడా ఆ ఆనందానిలయ వైకుంఠధాముడే రక్ష అని మనసా వాచా నమ్మి షోడశోపచార నవవిధ భక్తులతో అను నిమిషం కొలిచింది ఆ కుటుంబం. ఆ శ్రీనివాస వర కృపా కటాక్షానికి నిదర్శనంగా ఆ ఇంట పుట్టిన త్రిమూర్తులకు తిరుపతిరావు, వేంకటేశ్వర…

మృత్యుంజయ్ రివ్యూ : గురి తప్పని క్రైమ్ థ్రిల్లర్!

Mrityunjay Review: A crime thriller that hits the mark!

శ్రీవిష్ణు అంటేనే వైవిధ్యం. 2026లో ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’లో గెస్ట్ అప్పీరెన్స్‌తో, ‘విష్ణు విన్యాసం’తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో, ఇప్పుడు ‘మృత్యుంజయ్’ అనే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో విశ్లేషణలో చూద్దాం… కథ: హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే జై అలియాస్ మృత్యుంజయ్ (శ్రీవిష్ణు), నిజానికి ఒక క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ మేనేజ్‌మెంట్ అందుకు అవకాశం ఇవ్వదు. దాంతో అతను తన మార్కెటింగ్ టార్గెట్స్ కోసం ఒక వింత మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎవరైనా చనిపోతే, వారి ఇంటికి వెళ్లి, వారితో కలిసిపోయి, భావోద్వేగంగా ఒప్పించి ఆ పత్రికలో చనిపోయిన వారి ప్రకటనలు (Ads) ఇప్పిస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలో…

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ.. బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథి గా ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు టి.జి. విశ్వ ప్రసాద్, సినీ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్‌ & అలా మొదలైంది సినిమా ఫేమ్ స్నిగ్ధా తో పాటు ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పాల్గొని కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగింది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళలను ఒకే…

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

Women’s Cricket League Logo Unveiled on the Occasion of Women’s Day… Best Wishes from T.G. Vishwa Prasad and K.L. Damodar Prasad

Hyderabad, March 2026: The official logo of the Women’s Cricket League (WCL), organized with the aim of encouraging greater participation of women in sports, was unveiled in a grand event. Renowned film producer and founder of People Media Factory T.G. Vishwa Prasad and film producer K.L.Damodar Prasad attended the event as chief guests and conveyed their best wishes. The logo was unveiled in the presence of Women’s Cricket League Director and ‘Ala Modalaindi’ fame Snigdha, along with special guests Bigg Boss fame Sri Satya, Community Connect Sports Director Sandeep Varma,…

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది : టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

Crores of money has been received in Vijayawada and Chennai for adulterated ghee: TDP MLA and Sangam Dairy Chairman Dhulipala

•కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం •బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే •వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు, ఫేక్ బ్రతుకులు మీవి మావి కావు •రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పా, ఈరోజు అదే చెప్తున్నా * 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు * కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు •వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్‌, సాక్షి ఛానల్‌కి 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారు •వైసిపి ప్రభుత్వ హయంలో భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3…

వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య

Yuva Samrat Naga Chaitanya, Karthik Dandu, SVCC, Sukumar Writings’ Never Before Mythical Thriller Vrushakarma First Glimpse Opens Gates To A Terrifying Supernatural World, Offers Chilling Experience

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ ‘నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ’ టెర్రిఫైయింగ్ సూపర్ నేచురల్ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం,  ఒక్కసారిగా అతని లోపల నుంచి ఒక భయంకరమైన…

రెమ్యూనరేషన్ లో తగ్గేదే లేదు ..  వరుస హిట్స్ తో ఫుల్ జోష్!

There is no reduction in remuneration.. Full of excitement with consecutive hits!

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీని ఏలుతుంది.  వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఈ అమ్మడు  ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో సెన్సేషన్ సృష్టిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో నయనతార కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ మూవీ కోసం నయనతార తన  రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్ సరసన నయనతార నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ‘గంగ’ అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన నయనతార గన్ పట్టుకుని…

మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి

Manchu Manoj and Bhuma Mounika Reddy celebrated their three-year marriage with a grand celebration.

మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘భైరవం’,…