‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్ను ట్రైలర్ వాగ్దానం చేస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో తన…
Day: March 14, 2026
తెలుగు రాష్ట్రాల్లో 27న ‘హ్యాపీ రాజ్’
భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘హ్యాపీ రాజ్ ఈ నెల 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా…
‘పదే పదే’ మనసుని హత్తుకునే మెలోడీ..
‘పదే పదే ప్రాణం నిన్నే కోరగా/ కలే నిజం కాదా నిన్ను చేరగా/ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా/ ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ`..అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే ‘రాకాస’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ…
శ్రీదేవిని మించిన స్ట్రాటెజీతో..!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే? అందాల తార జాన్వీ కపూర్ అంటూ ఠక్కున సమాధానం వస్తే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులతో ఆమె కెరీర్ అగమ్య గోచరంగా కనిపించింది. కానీ ఆ వైఫల్యాలను దాటుకొని ప్రస్తుతం శ్రీదేవి ముద్దుల కూతురు తన కెరీర్ను గాడిలో పెట్టుకొనే పనిలో పడింది. దక్షిణాదిలో అగ్రహీరోలతో కలిసి నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం తన ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేస్తున్నది. ప్రస్తుతం జాన్వీ నిర్ణయాలు బాలీవుడ్లో భారీ చర్చకు దారి తీసింది. ఆమె తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటనే వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే నిర్ణయం తీసుకొన్నప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ శ్రీదేవీ, బోనికపూర్ దంపతులు ఆమెను ప్రముఖ నిర్మాణ…
