‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’ అరుదైన భగీరథ ప్రయత్నం 

'Mirjapuram Rani Krishnaveni' is a rare Bhagiratha attempt

శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు , నేను యూనివర్సిటీ లో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ రచించిన “మీర్జాపురం రాణి కృష్ణవేణి” పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ . దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. భగీరథ గారు చేయి తిరిగిన…

జియోస్టార్‌లో ప్ర‌భాస్ ‘ది రాజా సాబ్’ స్ట్రీమింగ్‌..

Prabhas' 'The Raja Saab' streaming on JioStar..

ప‌్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జియో స్టార్‌లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది. భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా పేరున్న ప్ర‌భాస్ ఈ చిత్రంలో న‌టించారు. దీంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 6న స్ట్రీమింగ్ అవుతుంద‌నే అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. హిప్నాటిక్ థ్రిల్ల‌ర్‌గా ఉత్కంఠ‌త‌ను పెంచే క‌థ‌తో సినిమా ప్రేక్ష‌కులను అంచ‌నాల‌ను పెంచుతోంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో ది రాజా సాబ్‌ను రిలీజ్ చేస్త‌న్నామ‌నే ప్ర‌క‌ట‌న‌తో పాటు, ట్రైల‌ర్‌కు  అభిమానుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్  సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఊపందుకున్నాయి.…

400 కోట్ల మార్కును చేరుకునే దిశగా.. బాక్సాఫీస్ సంచలనం

Box office sensation on the verge of reaching the 400 crore mark

*’మన శంకర వర ప్రసాద్ గారు’ 25 రోజుల్లో 375 కోట్లకు పైగా వసూలు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎం.ఎస్.జి’ నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి,…

భీమిలిలో మిస్టర్ వర్క్ ఫార్మ్ హోమ్ సినిమా బృందం సందడి

Mr. Work Farm Home movie team creates buzz in Bhimili

శనివారం భీమిలి తిమ్మాపురం లో విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్ లో మిస్టర్ వర్క్ ఫ్రొమ్ హోమ్ సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుక ను ఘనంగా నిర్వహించారు . ఈ సినిమా ను అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మధు దర్శకత్వం వహించగా, త్రిగున్ హీరోగా పాలయి రాధా కృష్ణ హారోహిన్ గా నటిస్తున్నారు.దర్శకుడు మధు మాట్లాడుతూ ఈ సినిమా వ్యవసాయంలో నూతన యంత్ర పరికరాలు వినియోగ ఆధారిత నేపథ్యంలో కధ నడుస్తుంది అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబం లో జన్మించిన ఒక యావకుడు, యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం, వినోదం కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. హీరో త్రిగున్ మాట్లాడుతూ ఈ సినిమా నేటి తరానికి చాలా అవసరం అని భావి తరాలకు ఈ సినిమా ఒక మెస్సేజ్…

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

“One by Four (One/4) is being embraced by audiences across all sections; absence of heroines during promotions caused loss to our film” – Movie Team at Success meet.

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం “వన్ బై ఫోర్” (One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇటీవల రిలీజైన “వన్ బై ఫోర్” (One/4) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ – మా “వన్…

“One by Four (One/4) is being embraced by audiences across all sections; absence of heroines during promotions caused loss to our film” – Movie Team at Success meet

“One by Four (One/4) is being embraced by audiences across all sections; absence of heroines during promotions caused loss to our film” – Movie Team at Success meet

Tejas Gunjal Films and Rohit Gunjal Films banners have produced the action crime drama “One by Four (One/4)”, starring Venkatesh Peddapalem, Aparna Mallick, and Heena Soni in lead roles. The film is directed by Bahubali Palani K, who earlier worked as an associate director for the blockbuster Baahubali. The movie is jointly produced by Ranjana Rajesh Gunjal and Rohit Ramdas Gunjal. Recently released, “One by Four (One/4)” has emerged as a successful film, receiving appreciation from audiences across all categories and running successfully in all centers. On this occasion, the…

సుప్రీంతీర్పు గైడ్‌లైన్స్‌ ప్రకారంగానే జర్నలిస్టులకు స్థలాలు

Places for journalists as per Supreme Court guidelines

* ప్రభుత్వానికి విచక్షణాధికారం ఎలైట్‌ పీపుల్స్‌తో జర్నలిస్టులను పొల్చవద్దు * జర్నలిస్టులకు లీగల్‌ ఒపీనియన్‌ అనుకూలమని అభిప్రాయపడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తులు , న్యాయవాదులు హైదరాబాద్‌ : జవరహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే వెసులుబాటు ఉందని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పులోనే సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని పేర్కొందన్నారు.ఆదివారం జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన “ఇళ్ల స్థలాలు- మార్గదర్శనం” అంశంపై న్యాయ నిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ బీఎస్‌ నారాయణ, జస్టిస్‌ చంద్రకుమార్‌, సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చే వెసులుబాటు…

ఆనందానికి అవధుల్లేవు : మెగాస్టార్ చిరంజీవి

There is no limit to happiness: Megastar Chiranjeevi

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు – ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంటి జరిగిన ఈ శుభవార్త మీతో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు కొణిదెల ఫ్యామిలీ అటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము.  మా ఇంట ఈ మంచి జరగాలని మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. భగవంతుడి…

హైదరాబాద్‌లో ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్

Fahadh Faasil's 'Don't Trouble the Trouble' shooting in Hyderabad

ఫహాద్ ఫాజిల్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్‌ను ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ తన మీద అభిమానంతో వ‌చ్చిన ఫ్యాన్స్‌ను చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. అభిమానుల సందోహం మధ్యే ఆయ‌న త‌న షూటింగ్‌ను ప్రారంభించారు. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫహాద్ ఫాజిల్ తన అభిమానుల్ని పలకరించారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహాన్ని గుర్తించి అక్కడకు వచ్చిన వారిని హృదయపూర్వకంగా పలకరించాడు. వచ్చిన అభిమానులు ఫహాద్ ఫాజిల్‌ను చూసి ఆనందపడటం, ఫ్యాన్స్‌ని చూసి ఫహాద్ ఫాజిల్ సంతోషించడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. సెట్‌లో సినిమా మొదటి రోజు ఓ పండుగ వైబ్ కనిపించినట్టు అయింది.…

మెగా కుటుంబంలో అద్భుత ఘడియలు

Amazing moments in the Mega family

* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన * గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శనివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి…