Renowned senior journalist and author Bhageeratha was lauded for his exceptional research and literary contribution at the book introduction programme of “Mirzapuram Rani Krishnaveni”, held on Thursday at Film Nagar Cultural Centre. Presiding over the event as the chief guest, Paruchuri Gopala krishna, President of the Telugu Film Writers Association, remarked that Bhagiratha deserves a Doctorate for his scholarly works such as Shakapurushudu, Tarakaramam, Nagaladevi, and Mirzapuram Rani Krishnaveni. He stated that if he were part of a university, he would have ensured a doctorate for Bhagiratha. Expressing deep reverence…
Day: February 5, 2026
‘మీర్జాపురం రాణి కృష్ణవేణి’ అరుదైన భగీరథ ప్రయత్నం
శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు , నేను యూనివర్సిటీ లో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ రచించిన “మీర్జాపురం రాణి కృష్ణవేణి” పుస్తక పరిచయ కార్యక్రమం గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే నాకు ఎంతో గౌరవం, అలాంటి కృష్ణవేణమ్మ జీవిత చరిత్రను వెలువరించిన భగీరధను, నిర్మాత అనురాధాదేవిని నేను మనసారా అభినందిస్తున్నా అని చెప్పారు గోపాలకృష్ణ . దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. భగీరథ గారు చేయి తిరిగిన…
జియోస్టార్లో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ స్ట్రీమింగ్..
ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్టెండెడ్ కట్తో డిజిటల్ ప్రీమియర్గా ఈ మూవీ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది. భారతదేశంలో బిగ్గెస్ట్ సూపర్స్టార్గా పేరున్న ప్రభాస్ ఈ చిత్రంలో నటించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఫిబ్రవరి 6న స్ట్రీమింగ్ అవుతుందనే అధికారిక ప్రకటనతో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైలర్ను విడుదల చేసింది. హిప్నాటిక్ థ్రిల్లర్గా ఉత్కంఠతను పెంచే కథతో సినిమా ప్రేక్షకులను అంచనాలను పెంచుతోంది. ఎక్స్టెండెడ్ కట్తో ది రాజా సాబ్ను రిలీజ్ చేస్తన్నామనే ప్రకటనతో పాటు, ట్రైలర్కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో ఊపందుకున్నాయి.…
400 కోట్ల మార్కును చేరుకునే దిశగా.. బాక్సాఫీస్ సంచలనం
*’మన శంకర వర ప్రసాద్ గారు’ 25 రోజుల్లో 375 కోట్లకు పైగా వసూలు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎం.ఎస్.జి’ నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి,…
