Vijay Deverakonda’s upcoming film directed by Gowtam Tinnanuri is one of the most anticipated films of 2025. The makers of VD12 have officially announced the film’s title – KINGDOM. The teaser is an adrenaline fueled action drama packed with intensity, emotions and scale. It promises a larger than life experience leaving audiences on the edge of their seats. To elevate the madness, Jr. NTR has lent his voice for the Telugu version, Suriya for Tamil and Ranbir Kapoor for Hindi. The presence of these powerhouses has taken the teaser to…
Year: 2025
‘తల’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీపై ప్రశంసలు కురిపించిన గెస్ట్ లు
దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా’తల’. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన.. దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “పాత తరంలో తల తాకట్టుపెట్టైనా పిల్లలన ప్రయోజనకులను చేయాలంటారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ తల పెట్టి కొడుకును మంచి హీరోను చేశాడు. టైటిల్…
Thala Will Become A Big Blockbuster – Celebrities at Film’s pre-release event
The pre-release event of Thala was a grand affair, building excitement for its release on February 14th. Directed by Amma Rajasekhar and produced by Srinivas Goud under the Deepa Arts banner, the film marks the debut of Amma Rajasekhar’s son, Amma Ragin Raj, as the lead actor. With Ankita Naskar as the female lead and a strong supporting cast including Rohit, Esther Noronha, Mukku Avinash, Satyam Rajesh, Ajay, Viji Chandrasekhar, Rajeev Kanakala, and Indraja, the film promises a mix of action, emotion, and sentiment. Director VN Aditya praised Amma Rajasekhar…
అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ “రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి” స్ట్రీమింగ్
ఓటీటీలో ఎక్కువ ఆదరణ పొందుతున్న జానర్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే “రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి” సినిమాపై ఓటీటీ ప్రేక్షకులకు అంతగా అభిమానం ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా అమోజాన్ ప్రైమ్స్ లో అందుబాటులోకి రావడంతో సంతోషం. తన్విక, మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. తాజాగా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమాలో…
ఆ హీరో కోసం భారీ సినిమాను రిజక్ట్ చేసిన అనన్యపాండే
బాలీవుడ్ బ్యూటీ ‘‘ అనన్య పాండే ‘‘ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈమె.. తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో తెలుగులో మళ్లీ మరో సినిమాకు ఓకే చెప్పలేదు. రీసెంట్ గానే లైగర్ సినిమాను అనన్య అయిష్టంగానే ఒప్పుకుందని చుంకీ పాండే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా…
హీరో కోసం కోట్ల ఆస్తిని రాసిచ్చింది..
హీరో అభిమాని ఏకంగా కొన్ని కోట్ల విలువైన తన ఆస్తిని స్టార్ హీరో పేరు మీద రాసిచ్చి చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. సదురు హీరో చలించిపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. ముంబైకు చెందిన నిషా పాటిల్ కు నటుడు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్ నుంచి ఖల్ నాయక్ దాకా, సంజు నుంచి కెజిఎఫ్ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది. అయితే ఇటీవల నిషా పాటిల్ కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటికి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. కాగా, అదంతా సంజయ్ దత్కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కు…
సూర్యతో నటించడం గర్వంగా ఉంది : పూజా హెగ్డె
హీరో సూర్య నటించే 69వ చిత్రంలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘రెట్రో’ మూవీ చిత్రీకరణ పూర్తి చేసి మే ఒకటో తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇందులో తనకు దక్కిన అవకాశంపై పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలన్నీ నన్ను గర్వపడేలా చేశాయి. కానీ, ‘రెట్రో’ మాత్రం నేను గర్వించే చిత్రంగా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం నాకు చాలా ఇష్టం. షూటింగు సమయంలో పొందిన అనుభూతి ఎన్నటికీ మరిచిపోలేనిది. సినిమా ఇంకా చూడకుండానే గట్టి నమ్మకంతో చెబుతున్నాను. ప్రస్తుతం ‘రెట్రో’ మూవీ ఎడిటింగ్ జరుగతోంది. త్వరలోనే మేకర్స్ ఆడియో, ట్రైలర్ రిలీజ్ తేదీలు వెల్లడిస్తారు’ అని వివరించారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ తో ‘జన నాయగన్’,…
విజయ్తో మరోసారి శృతిహసన్!
అగ్రహీరో విజయ్ నటిస్తున్న 69వ చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్ సరసన ‘పులి’ సినిమాలో శృతి హీరోయిన్గా నటించారు. సుదీర్ఘకాలం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో శృతి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతుంది. రజనీకాంత్, శృతిహాసన్ ఇటీవలే థాయ్ నుంచి చెన్నై తిరిగి వచ్చారు. అదే సమయంలో విజయ్ 69వ చిత్రం ‘జన నాయగన్’ షూటింగ్ నగర శివారు ప్రాంతమైన పనైయూరులో జరుగుతుంది. ఈ షూటింగ్లో శృతిహాసన్ పాల్గొన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. హెచ్.వినోద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో బాబీ డియోల్, మమితా బైజు, గౌతం వాసుదేవ మేనన్, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి, డీజే అరుణాచలం తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందే ఈ…
జ్ఞానంతో పాటు సంస్కారం అవసరం : టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ
విద్య అనేది మనిషికి కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుందని, అయితే జ్ఞానంతో పాటు సంస్కారాన్ని అందిస్తేనె ఆ విద్యకు సార్థకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు. మంగళవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ఎస్.యం.ఆర్ ఫంక్షన్ హలులో జరిగిన త్రివేణి హైస్కూల్ 17వ, వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుల్లో డిగ్రీలు పొందడం ద్వారా సమాజంలో విద్యావంతులుగా మాత్రమే గుర్తింపు పొందగలుగుతారని , అదే సంస్కారంతో కూడిన విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉత్తములుగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నేడు రాకెట్ వేగంతో సాంకేతిక రంగం దూసుకెళ్తుండడంతో సమాజం ఎంతో మురిసిపోతుందని, కానీ దాని నుండి సంభవిస్తున్న దుష్పరిణామాలను మాత్రం…
‘వీడీ12’ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్కు 12వ చిత్రం. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్తో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థతో పాటు, హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్, టీజర్ను విడుదల చేసే సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ చిత్ర టైటిల్, టీజర్ విడుదల కానుంది. అయితే ఈ టీజర్కు తమిళ్లో సూర్య, హిందీలో రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాయిస్ ఓవర్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ దేవకొండ…