రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ ట్రైలర్ విడుదల

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ చిత్రం ట్రైలర్ ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయింది. అక్షయ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు వారి హృదయాన్ని కొల్లగొట్టిన బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుండగా మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందన్నారు.…