‘Devara’ is a big budget film starring Man of Masses in the title role. Directed by Koratala Siva. Another Bollywood star Saif Ali Khan played a pivotal role in this movie starring Jhanvi Kapoor as the heroine. Presented by Nandamuri Kalyan Ram and produced by Mikkilineni Sudhakar, Harikrishna.K under the banners of NTR Arts and Yuva Sudha Arts, the film had a worldwide grand release on September 27. On this occasion, the film unit organized success celebrations. In this program… Film director Koratala Siva said, “Thanks to the Telugu audience…
Year: 2024
Devara Movie Review in Telugu : ‘దేవర` మూవీ రివ్యూ: ఫ్యాన్స్ కు పండగే!
By M D ABDUL/Tollwoodtimes (చిత్రం : దేవర, విడుదల : 27 సెప్టెంబర్ 2024, రేటింగ్ :3.5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు. దర్శకత్వం: కొరటాల శివ, నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ : రత్నవేలు, ఎడిటర్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘దేవర`. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో విజువల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.…
‘ఎమర్జెన్సీ’కి లైన్ క్లీయర్!
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది. దీంతో కంగన టీమ్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను ఆదేశించింది. ఈ…
‘సత్యంసుదందరం’ విజయాన్ని అందుకోవాలి… చిత్రం విడుదల సందర్భంగా సాయిదుర్గా తేజ్ పోస్ట్
కార్తి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ఈ సినిమా విడుదలను ఉద్దేశించి తాజాగా సాయిదుర్గా తేజ్ కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ’సత్యం సుందరం’ పేరుతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సాయిదుర్గా తేజ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందు కోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన చిత్రం ‘సత్యం సుందరం’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మనసుని హత్తుకునే చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్, కార్తి అన్న కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరవిందస్వామి, సూర్య, జ్యోతికతోపాటు చిత్రబృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీనిపై కార్తి…
అబుదాబి వేదికగా ఐఫా వేడుకల్లో నటి రేఖ ప్రత్యేక నృత్యప్రద్శన
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగనుంది. ఈ సినీ పండగ ఐఫా 2024 కోసం ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్లో సీనియర్ నటి రేఖ నృత్య ప్రదర్శన ప్రత్యేకం కానుంది. ప్రతి ఏడాది తన డ్యాన్స్తో ఆకట్టుకునే రేఖ ఈ ఏడాది కూడా ప్రత్యేకత చాటుకోనున్నారు. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై డ్యాన్స్ చేయనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఐఫాకు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది. అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతను చాటడం నాకు…
పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో… క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ!?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ హీరో అని అన్నారు. సోషల్ విూడియా వేదికగా అభిమానులు, నెటిజన్లతో తరచూ ఇంటరాక్ట్ అవుతూ నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చే ఆయన తాజాగా పవన్కల్యాణ్ గురించి మాట్లాడారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పవన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కృష్ణవంశీగారు విూ సినిమాలంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఆంధప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా విూ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం‘ అని ఎక్స్లో నెటిజన్ అడగగా దానికి ఆయన సమాధానమిచ్చారు. ‘మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. నిజం…
హాలీవుడ్ స్థాయిలో ఎన్టీఆర్ ‘దేవర’ నిర్మాణం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్ ‘దేవర’తో సిద్ధమయ్యారు. యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకొని అంచనాలను రెట్టింపు చేశారు. ‘బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని…
‘దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది…!
ఏపీలో ‘దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. అదేంటంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. విశాఖపట్నంలో చాలా చోట్ల ‘దేవర’ సినిమా పోస్టర్లపై ’సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా? విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్…
ఎన్ఠీఆర్ ‘దేవర’కోసం అధికారికంగా బ్లాక్ టిక్కెట్ల దందా!?
అగ్ర హీరోల సినిమాలు విడుదల సందర్బంగా టిక్కెట్ల రేట్లు పెంచి రెండు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేలా సినిమా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి రేట్లు పెంచుకునేందుకు సహకరిస్తున్నాయి. దీంతో టిక్కెట్లు అమాంతంగా పెరుగు తున్నాయి. అంతేమేరకు బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇకపోతే మిడ్నైట్ ఫ్యాన్స్ షో, బెనిఫిట్ షోలు వేయడం ద్వారా మరింత గుంజేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను అందరికన్నా ముందుగా చూడాలని ఫ్యాన్స్ చూపించే ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని బెనిఫిట్ షో నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తెరపై…
‘గొర్రె పురాణం’ చిత్రానికి ప్రశంసల జల్లు… దర్శకుడు బాబీ గట్స్ కు హ్యాట్సాఫ్!
టాలీవుడ్ నవతరం హీరో సుహాస్ ‘గొర్రె పురాణం’ చిత్రం ప్రమోషన్లలో కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సోషల్ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుకున్నారు.ఈ ‘గొర్రె పురాణం’ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పుకార్లు షికారు చేయడంతో ‘గొర్రె పురాణం”పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాంతో సినిమా ఫలితంపై కూడా ఎంతగానో ప్రభావం పడిందని సినీప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు. . ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు ‘గొర్రె పురాణం’ సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ సినిమా ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా కూడా చాలా ఆరుదు. గొర్రె పురాణం…
