‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ సోయగం మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ తాజాగా సైమా వేడుకలో మృణాల్ ఠాకూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో లావణ్య త్రిపాఠిను హైదరాబాద్కు వచ్చేయమ్మా అని దీవిస్తే తాను తెలుగింటి కోడలు అయిందని, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను కూడా అలాగే దీవిస్తున్నానని అరవింద్ తెలిపారు. దాంతో మృణాల్ ఎవరైనా తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నారా..? అని పలువరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం…
Month: October 2023
అనసూయ.. నెటిజన్లకు మరోసారి టార్గెట్ !
అనసూయ టీవీ యాంకర్గా ఎంత ఫేమస్ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే! సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ట్రోలింగ్, మీమ్స్ అంటారా లెక్కలేనన్ని. అయితే వీటిపై పెద్ద దృష్టి పెట్టదు అనసూయ. సమయం వచ్చినప్పుడు మాత్రం దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయింది అనసూయ. ఓ టీవీ ఛానల్లో జరిగే అవార్డ్ ఫంక్షన్ లో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ కోసం అనసూయ మహానటి సావిత్రి గెటప్ వేశారు. అంతే కాదు.. జమున, శ్రీదేవి, సౌందర్య లాగా కూడా కనిపించింది. గతంలో…
రెండో పెళ్లి గురించి ఫైర్అయిన ప్రగతి..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్ సైట్లు రాసుకొచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇలా ఫేక్ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారని ఫైర్ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దృష్ప్రచారలపై ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్…
రూమర్స్ను ఎదుర్కోవటం మామూలే… పట్టించుకోను : కృతిసనన్
‘‘జీవితంలో అద్భుమైన క్షణాలు ఒక్కసారే వస్తాయి. ఆ ఫీలింగ్ గొప్పది. ఇటీవల జాతీయ అవార్డును రాష్ట్రపతితో అందుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. మరాఠీ రీమేక్ అయిన ‘మిమి’లాంటి మహిళా ప్రాధాన్య పాత్ర ‘మిమి రాథోర్’ పాత్ర దొరకటం అదృష్టం. ఇందులో సరోగసి అమ్మగా నటించా. ఆ పాత్రకోసం ఎంతో కష్టపడ్డా’’ అన్నారు కృతిసనన్. టాలీవుడ్లో నటిగా పరిచయమై బాలీవుడ్లో ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సరోగసి అమ్మగా నటించడం కోసం ఎంతో కష్టపడ్డా. ఆ సమయంలో బాగా తినేదాన్ని. ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని. యోగా, కసరత్తులు వదిలేశా. 15 కిలోలు బరువు పెరిగా. ఆ కష్టం ఊరికే పోలేదు. తగిన గుర్తింపు దక్కింది. మిర్చిమ్యూజిక్ అవార్డ్స్, ఐఫా, ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డు దక్కడం అరుదైన గౌరవం.…
అంతా తమనే చేశాడు.. ‘గుంటూరు కారం’లో ఎన్నో విశేషాలు
మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్ అవుట్ అన్నారు. కానీ తమన్ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్ పి.ఎస్ .వినోద్ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్. మహేశ్ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా…
శంకర్ ‘ఇండియన్.2’ సినిమా అప్డేట్ వచ్చేసింది…!
27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్హాసన. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ‘ఇండియన్ (భారతీయుడు`ఎనిటతిజీని `2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్`2 వస్తోంది. ‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతిగా కమల్ ఎంతటి పవర్ఫుల్ రోల్ చేశారో.. ఇప్పుడు అంతకుమించి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు శంకర్. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటింది. పలు కారణాల చేత షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా శంకర్ పూర్తిగా ఈ చిత్రం విూదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లోని లోలా వీఎఫ్ఎక్స్ కంపెనీలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి శంకర్ ఓ పోస్ట్ పెట్టారు. ఆదివారం ఈ…
శ్రీల లిప్లాక్ సినిమా ఏంటో తెలుసా?
శ్రీలీల ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుని తిరుగులేని అధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాలను లైన్లో పెట్టింది. స్టార్ హీరోలు సైతం తన కాల్షీట్ల కోసం వేచి చూసేలా చేస్తు భారీ పారితోషకంతో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్నది. శ్రీలీల సినిమాలో ఉంది అంటే దానికి ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తున్నది. ఈ అమ్మడు దెబ్బకు అప్పడివరకు ఫుల్ బీజీగా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నాలు వేరే ఇండస్ట్రీల వైపు మళ్లేలా చేసిందంటే శ్రీలీల రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.…
మెగాస్టార్ ‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు!
చిరంజీవి సినీ చరిత్రలో ‘ఖైదీ’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్ ఫార్మెట్ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40…
ఘనంగా హీరో అర్జున్ కూతురి ఎంగేజ్మెంట్!
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్`లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ విూడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిరదట. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య మధ్య…
First Song From Priyanka Upendra ‘s 50th Film ‘Detective Teekshana’ Is Out… Rage Of Teekshana’ Is Highly Impressive
Action Queen Dr Priyanka Upendra is coming as ‘Detective Teekshana’ which also marks her 50th film. Recently released trailer set the right expectations about the film. This Trivikram Raghu directorial is bankrolled by Guttha Muni Prasanna, Muni Venkat Charan and Purushottam B. Koyyur under Event Linkx Entertainments and SDC Cine Creations banner in an uncompromised manner. Priyanka Upendra makes her entry as ‘Detective Teekshana’ to solve gruesome murders in the film. The film is an amalgamation of Thrilling, Action and Emotional elements together. Priyanka Upendra did the action stunts by…