‘పులి’ బాహుబలి, త్రిబుల్ ఆర్ స్థాయిలో వుంటుంది: ‘ టీజర్ విడుదలలో చిత్ర యూనిట్

'పులి' బాహుబలి, త్రిబుల్ ఆర్ స్థాయిలో వుంటుంది: ' టీజర్ విడుదలలో చిత్ర యూనిట్

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా ‘అమ్మదొంగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ‘పులి’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘The 19th century’ అన్నది ఉపశీర్షిక. ఈ రోజు పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సిజు విల్సన్, హీరోయిన్ కాయాదు లోహర్ , దర్శకుడు వినయన్, నిర్మాత సుధాకర్ బాబు, ప్రసాద్ నాయక్,…

‘కొరమీను’ నుంచి మెలోడీ సాంగ్ ‘మీనాచ్చి మీనాచ్చి..’ వచ్చేసింది!

'Meenacchi Meenacchi' is a melody from 'Korameenu' 'Korameenu' will be released in theatres on December 31

ప్రేమ‌కు పేద‌, ధ‌నిక అనే బేదం ఉండ‌దు. మ‌న‌సుకు న‌చ్చిన వారు క‌న‌ప‌డితే చాలు వెంట‌నే ప్రేమ పుడుతుంది. మనసులో ప్రేమ పుట్టటం కాదు.. ఆ ప్రేమ‌ను నిచ్చెలికి అందంగా చెప్ప‌ట‌మూ ఓ క‌ళ. మీనాక్షిని చూడ‌గానే ఆ యువ‌కుడికి హృద‌యం ల‌య త‌ప్పింది. ఇంకేముంది. ‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడ‌గా.. ఓ.. ఓ/మ‌న‌సిచ్చి మ‌న‌సిచ్చి న‌చ్చా నిన్నుగా.. ఓ ..ఓ/ క‌ల‌గా వ‌చ్చేశావు క‌ళ్ల‌కెదురుగా../ అల‌వై లాగావు నన్ను పూర్తిగా.. .. ’’అంటూ అందంగా పాట రూపంలో మీనాక్షిని త‌న ప్రేమ‌ను చెప్పేశాడా యువ‌కుడు. ఇంత‌కీ క‌థానాయ‌కుడు ఎవ‌రు? అత‌ని హృద‌యాన్ని దోచుకున్న మీనాక్షి ఎవ‌రు? అనే విష‌యం తెలుసుకోవాలంటే ఆనంద్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న ‘కొరమీను’ సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి…

రవితేజ ‘ధమాకా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s "DHAMAKA" Theatrical Trailer Launched

మాస్ మహారాజా రవితేజ, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ధమాకా’తో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు. స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో…

‘దేవుడు వరమందిస్తే..’ సంగీతంలో ‘రివ్వున ఎగిరే గువ్వలా..’ ఎగరాలనుంది : ఘంటాడి కృష్ణతో ఇంటర్వ్యూ…

music director gantadi krishna interview

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.., అందమైన కుందానాల బొమ్మరా.., రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా.., పండు వెన్నెల్లో ఈ వెనుగానం అంటూ వ‌చ్చిన పాటలు ఇప్ప‌టికి వినిపిస్తున్నాయంటే ఆ పాటలు ప్రేక్ష‌కుల్నిఎంతగా అల‌రించియో ఇట్టే అర్ధమవుతోంది. ప్రేక్షకుల మనస్సులో బలంగా నాటుకుపోయిన విధానం అంతా ఇంతా కాదు. ఇవొక్క‌టే కాదు.. సంపంగి, 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రీ రామచంద్రులు, ప్రేమలో పావనీ కళ్యాణ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, అవతారం, వైఫ్, అందాల ఓ చిలుక వంటి సినిమాలకు మ్యూజికల్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాతో సంబంధం లేకుండా ఆడియో సూప‌ర్‌హిట్ చేయ్య‌ట‌మే కాకుండా, ఆ పాటలు అంద‌రూ పాడకునేలా సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ.…

ఇక విరామం లేకుండా షూటింగుల్లో ప్రభాస్!?

Eka viramamlekuda shootingullo hero prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన పద్దతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇదివరకైతే.. తను కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం అలవాటుగా ఉండేది. కానీ ఈ సారి తన పద్ధతి మార్చి విరామం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సెట్‌లో అడుగుపెడుతూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలను పూర్తి చేయడమే కాదు.. కొత్త చిత్రాల షూటింగ్‌లనూ వెంటనే ప్రారంభిస్తున్నారు. ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ వంటి భారీ చిత్రాల రెగ్యులర్‌ షూటింగ్స్‌ చేస్తున్నారు. ‘ఆది పురుష్‌’ సినిమా వర్క్‌ కూడా కొంత పెండింగ్‌ లో ఉంది. ఇవన్నీ ఉండగానే…తాజాగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్‌లో సైతం అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఓ భారీ హౌస్‌ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభాస్‌…

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ నుంచి పూజాహెగ్డే ఔట్!?

pavankalyan cinemanunchi pooja out

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాజాగా సెట్స్ పై వచ్చిన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను వదులుకున్నబ్యూటీ ఎవరో తెలుసా? పూజాహెగ్డే! అవును.. ఇది నిజంగా నిజమైన వార్తే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని వదులుకోవడమేమిటి? అని అనుకుంటున్నారు కదూ..!? అవును ఎవ్వరికైనా ఇదే డౌట్ రావడం కామనే! పరిశ్రమలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ రెండుపడవల ప్రయాణం చేస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ అంటూ అవసరానికి కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇదంతా ఆ భామల అత్యాశే అవుతోంది. అక్కడా మేమే .. ఇక్కడా మేమే అన్న రీతిలో వీరి వ్యవహారం సాగుతోంది. ఫలితంగా కాల్షీట్స్ కుదరకపోవడంతో కొన్ని మంచి సినిమాలను సైతం వదులుకోవలసి వస్తోంది. అన్ని భాషల్లో తమ గ్లామర్ ని పంచుతుంటారు ఈ బ్యూటీస్. ఈ క్రమంలో నాయికలు ఎదుర్కొనే ప్రధాన సమస్య…

17న నిఖిల్-అనుపమా పరమేశ్వరన్ ’18 పేజెస్’ ట్రైలర్ రానుంది

Nikhil 18 pages movie Still

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా…

Ideal Multiplex Launches AMR Planet Mall : Secunderabad’s first state-of-art Mall and a 7-screen Multiplex

Ideal Multiplex Launches AMR Planet Mall : Secunderabad’s first state-of-art Mall and a 7-screen Multiplex

Hyderabad, 14 December 2022: Ideal Multiplex launched AMR Planet, a state-of-art mall and multiplex in Secunderabad. The AMR Planet Mall was inaugurated by Shri Nandamuri Balakrishna, an eminent film personality and a super star of Telugu Cinema. The AMR Planet mall is situated in Moulali and is spread over 220,000 Sq ft with over 40 retail stores. The Mall also has a food court spread over 18,000 Sq ft with 14 brands catering multiple cuisines. It also has a capacity to park 450 cars for the convenience of the customers.…

‘తారకరామ’ థియేటర్ పునః ప్రారంభం

'తారకరామ' థియేటర్ పునః ప్రారంభం - తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది.. - 'తారకరామ' థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.. - అందరికీ అందుబాటులో టికెట్ ధర వుండటం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం -నందమూరి బాలకృష్ణ కాచిగూడలోని 'తారకరామ' థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై వున్న అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు 'ఏషియన్ తారకరామ' థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారి చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు. అది ఆయన దూరద్రుష్టి. ఆయన నటిస్తుంటే జానపదాలు జావళీలు పాడాయి. పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. సాంఘికాలు సామజవరగమనాలు పాడాయి. కళామతల్లి కళకళలాడింది. నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావు గారు. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది. డాన్ సినిమా ఇక్కడ 525రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు 'మంగమ్మగారి మనవడు', 'ముద్దుల మావయ్య', 'ముద్దుల కృష్ణయ్య', 'అనసూయమ్మగారి అల్లుడు'.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్ లోనే నాన్న గారు నామకరణం చేశారు. నారాయణ్ కె దాస్ నారంగ్ గారికి నాన్నగారి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది. ఈ అనుబంధం ఇలానే కొనసాగించాలి. సునీల్ నారంగ్ గారు అందరి అందుబాటు ధరలో టికెట్ రేట్లుని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఎంతమంది ఎన్నిసార్లు థియేటర్ కి వచ్చి సినిమా చుస్తారనేది ఒక ప్రశ్న. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందం వేరు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు చలన చిత్ర పరిశ్రమ వర్ధిల్లి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ థియేటర్ వుంది. బాలకృష్ణ గారు ఇక్కడికి విచ్చేసి థియేటర్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. ఈ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. ఇక్కడ మళ్ళీ సిల్వర్ జూబ్లీలు పడతాయి. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ ని అద్భుతంగా నిర్మించాం. 600 సీటింగ్ తో హాల్లో పూర్తి రెక్లైనర్ సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్ గా పెట్టాం. మా నాన్నగారు, ఎన్టీఆర్ గారు చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్ లో కూడా ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

– ‘తారకరామ’ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.. – తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది – అందరికీ అందుబాటులో టికెట్ ధర వుండటం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం – నందమూరి బాలకృష్ణ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై వున్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారి చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను…

సంక్రాంతి సంబరం ఎక్కడికి దారితీస్తుందో..!?

సంక్రాంతి సంబరం ఎక్కడికి దారితీస్తుందో..!?

వెండితెరకు ఈ సంక్రాంతి సంబరం బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని సినీ జనాలు వాపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతుండడంతో ఇరువర్గాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి యూరప్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ తో పాటు శృతిహాసన్ పాల్గొంటోంది.…