ఆలేరులో మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం : నియామక పత్రాలు అందజేత

aler news
Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రాలు అందజేశారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ చైతన్యవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి మహిళ ఒక ఆదిశక్తి గా మారి శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఎక్కడైనా నా మహిళలపైన సంఘటన జరిగితే వెంటనే మహిళా కాంగ్రెస్ ముందుంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుందని మాట్లాడడం జరిగింది.
మరియు ఆలేరు నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి ఎవరూ లేరు. ఎవరికీ నేను నియామక పత్రం ఇవ్వలేదు. కాబట్టీ జిల్లా కమిటీ మెంబర్స్ గాని. మండల పార్టీ అధ్యక్షులు గాని. బ్లాక్ అధ్యక్షులు గాని గమనించగలరు.
ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు చైతన్య. రాజాపేట మండల పార్టీ అధ్యక్షురాలు అంబాబాయి. ఆలేరు మండల పార్టీ అధ్యక్షురాలు అనిత. జిల్లా కార్యదర్శి ప్రతిభ. ఆలేరు టౌన్ అధ్యక్షురాలు అనిత. రాజంపేట టౌన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి. సోమవారం గ్రామ శాఖ అధ్యక్షులు పద్మ. అమృత. బాలమ్మ. కవిత.రజిత మొదలగు వారు పాల్గొన్నారు

Related posts

Leave a Comment