ఆలేరులో కామ్రేడ్ బాదే రాము వర్ధంతి

Spread the love

టాలీవుడ్ టైమ్స్ – ఆలేరు

అఖిల భారత రైతు.కూలీ సంఘం (AIKMS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు,కోదాడ డివిజన్ కమిటీ కార్యదర్శి, కామ్రేడ్ బాదే రాము 2వ,వర్ధంతి ఆలేరు న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ రాము చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సారాల క్రితం కామ్రేడ్ రాము కోదాడ వద్ద యాక్సిడెంట్స్ లో మృతి చెందాడు. కామ్రేడ్ రాము అట్టడుగు వర్గం నుండి విప్లవోద్యమం లోకి వచ్చాడు.కాదు పేదరికాన్ని అనుభవిస్తూనే ప్రజలు,రైతులు,ఇతర వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ,నిరంతరం రైతాంగ ఉద్యమంలో అన్ని రంగాల ప్రజలను పోరాటాల్లో కి నగిపించాడని అన్నారు. పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా నిజాయితీగా విప్లవం కోసం పోరాడిన త్యాగదనుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు ఇక్కిరి కుమార్, చీర బోయిన రాజయ్య, వరిమడ్ల శ్రీను, ఏనుగుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment