హైదరాబాద్: వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సల్మాబేగం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా సల్మాబేగం మాట్లాడుతూ నన్ను వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సూచనలను పాటిస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు శ్రమించనున్నట్టు పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నందుకు వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం లోటస్ పాండ్ లోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ షానవాజ్ ఖాన్ సందర్శించారు.
Related posts
-
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
Spread the love సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్... -
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
Spread the love వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె... -
ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిక !!!
Spread the love ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు...