ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరడం పద్మశాలిల్లో నూతనోత్సాహం నింపింది : బొట్ల పరమేశ్వర్

Spread the love
  • టాలీవుడ్ టైమ్స్ – హైదరాబాద్ బ్యూరో: తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)లో చేరిన సందర్బంగా ఆయన చేరికను స్వాగతిస్తూ భువనగిరి యాదాద్రి జిల్లా ఆలేరు మాజీ జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బి.ఎస్ రాములు, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వనం దుష్యంతుల, తెలగాణ రాష్ట్ర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటుక రూప, డా. క్రాంతి, శ్రీనివాస్, వనం విశ్వనాధం హైకోర్టు అడ్వకేట్ , ఎర్రమాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ -” తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)లో చేరిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలిల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగమిస్తోంది. నిరుపేదలను ఆదుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. ఆలేరు ఎంఎల్.ఏ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆలేరును ప్రగతి పథంలో నడిపిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)లో చేరడం శుభసూచకమని బొట్ల పరమేశ్వర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరడం పద్మశాలిల్లో నూతనోత్సాహం నింపిందాని బొట్ల పరమేశ్వర్ అన్నారు.

Related posts

Leave a Comment