టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు .’గాడ్ఫాదర్’ చిత్రం దీనికి వేదిక కానుంది. మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి .’గాడ్ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్కి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు’ అంటూ సల్మాన్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.…