గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్ విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్ ప్రేక్షకులతో పురచ్చి తలపతి అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుపరిచితమై తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు విశాల్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ…