తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దుబాయ్లో అంగరంగ వైభవంగా టిఎఫ్సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టిఎఫ్సిసి నంది అవార్డులకు సంబంధించిన బ్రౌచర్ను ప్రముఖ నటుడు హీరో సుమన్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ గారు మాట్లాడుతూ.. దుబాయ్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం, ఇక్కడ వ్యాపారం మాత్రమే కాకుండా కళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు దుబాయ్లో ఉత్తరాదికి చెందిన సినిమా అవార్డుల వేడుకలు జరిగాయి, ఈసారి టిఎఫ్సిసి సౌతిండియా నంది అవార్డులను దుబాయ్లో నిర్వహిస్తున్నందుకు ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ గారిని అభినందిస్తున్నాను. ప్రత కళాకారుడు, టెక్నీషియన్కి గుర్తింపు ఎంతో అవసరం, ప్రతిభను గుర్తించి వారికి నంది అవార్డులను ఇచ్చి వారిలో మరింత చైతన్యం, ఉత్తేజం కలిగించడం మంచి…