నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఇది విూడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఆ కార్యక్రమానికి విూడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివరించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్లో…