మెగా ప్రిన్స్ వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వెండితెరపై నటించి, ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఆరేళ్ల తమ ప్రేమను ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహబంధంగా మార్చుకున్నారు.బుధవారం రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిముషాలకు లావణ్య మెడలో వరుణ్తేజ్ మూడు ముళ్లూ వేశారు. ఇరువైపు కుటుంబాల సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీశ్ ఈ పెళ్లిలో సందడి చేశారు. అలాగే హీరో నితిన్ భార్య షాలినీతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ నెల 5న హైదరాబాద్లోని ఎన్. కన్వెన్షన్లో వరుణ్తేజ్, లావణ్యల రిసెప్షన్ జరుగుతుంది. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్ 09న కుటుంబ…