తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొచ్చిన సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థల జాబితాలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పేరు తప్పకుండా ఉంటుంది. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, నానితో ‘జెంటిల్మన్’, సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’, సమంతతో ‘యశోద’ వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు అందించారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఆయన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి నేటికి 36 వసంతాలు. చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘చిన్నోడు – పెద్దోడు’. ఏప్రిల్ 1, 1988లో విడుదలైంది. ఆ సినిమాతో స్ట్రెయిట్ నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ ప్రయాణం ప్రారంభమైంది. అంతకు ముందు కంటెంట్ రిచ్ తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇచ్చామా? లేదా?…