కార్తి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ఈ సినిమా విడుదలను ఉద్దేశించి తాజాగా సాయిదుర్గా తేజ్ కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ’సత్యం సుందరం’ పేరుతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సాయిదుర్గా తేజ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందు కోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన చిత్రం ‘సత్యం సుందరం’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మనసుని హత్తుకునే చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్, కార్తి అన్న కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరవిందస్వామి, సూర్య, జ్యోతికతోపాటు చిత్రబృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీనిపై కార్తి…