క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. గురువారం హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంచ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ బి. దయానంద్లు విచ్చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సినిమా పోస్టర్, టీజర్లను ఆవిష్కరించారు. అనంతరం చిత్రంలోని 5 పాటల్లోంచి 4 పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… సహజంగా నేను సినిమా ఈవెంట్లకు రాను. అయితే వెంకన్నగారు పోలీస్ ఆఫీసర్ మీద తీసిన అని చెప్పారు. అలాగే ట్రైలర్ కూడా చూపించారు. అది చూసిన తర్వాత ఇంప్రెస్ అయి ఈ కార్యక్రమానికి రావటానికి అంగీకరించాను.…