జోజు జార్జి నటించిన ఇరట్ట సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే జోజు జార్జి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. వినోద్ , ప్రమోద్ అనే రెండు రోల్స్ లో జోజు జార్జి నటించారు. ఈ సినిమా ద్వారా ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పు పాతు పప్పు మరియు సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టేట్ నేషనల్ అవార్డ లు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో మరో విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. జోజు మరియు అంజలితో పాటుగా శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్ మరియు అభిరామ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.…