సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరో గుడ్న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా రాబోతుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్కు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించనుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను పవర్ఫుల్ వీడియో కంటెంట్తో అనౌన్స్ చేయటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బివి వర్క్స్తో కలిసి నిర్మిస్తోన్నఈ సినిమా నేషనల్ రేంజ్లో అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. బన్నీవాస్తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ అనౌన్స్మెంట్ తెగ వైరల్ అవుతోంది.…
