పాత్రికేయుల జాతీయ సమావేశాలకు మహ్మద్ రఫీ

Mohammed Rafi to address national journalists' conference

సీనియర్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు కేరళ రాజధాని తిరువనంతపురంలో తొలిసారి జరగనున్న జాతీయ సమావేశాల్లో పాల్గొనమంటూ సీనియర్ పాత్రికేయులు మహ్మద్ రఫీకి ఆహ్వానం అందింది. దేశంలోని పలు జర్నలిస్ట్ నేతలతో పాటు కొంతమంది సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన పాత్రికేయులు ఈ సమావేశాల్లో పాల్గొని మేధోమథనం చేయనున్నారు. ముఖ్యంగా 60 దాటిన పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం పింఛన్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. కేరళ స్టేట్ గెస్ట్ హౌస్ ఆడిటోరియంలో జరిగే ఈ జాతీయ సమావేశాలను ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వంద మంది సీనియర్ పాత్రికేయులను ఈ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. పాత్రికేయులకు సంబంధించిన…