శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 2న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో చేశాం. ఇటీవల మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ కు మంచి…