రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ కలెక్షన్లు!? ఆగస్ట్ 10న విడుదలైన రజనీకాంత్ ’జైలర్’ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. అంచనాలను మించి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే మంచి వసూళ్లను కూడా అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాల్ర విషయానికొస్తే మంచి కలెక్షన్స్ దక్కాయి. రజనీ గత చిత్రాలతో పోలిస్తే ఈ ‘జైలర్’ చిత్రం తొలి రోజు భారీ స్థాయిలో షేర్ వసూళ్లను అందుకుంది. తెలుగు రాష్టాల్లో రజనీ చివరి చిత్రం ’పెద్దన్న’ రూ.1.60కోట్లు సాధించగా, ’దర్బార్’ రూ.4.52కోట్లు, ’పేట’ రూ.1.65కోట్లు వసూళ్లు మాత్రమే చేశాయి. అయితే వీటికన్నా ముందు ‘రోబో 2.0’ మాత్రం అత్యధికంగా రూ.12.5కోట్లను అందుకోంది. ‘జైలర్’ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్లో రూ. 94 లక్షలు,…