సందీప్కుమార్, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ద క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 13న మాత్రం మల్టీపెక్స్లో రూ.112లకే సినిమా టికెట్ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్ టీజర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్ అంతా…